Pakistan: బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదుల హతం.. పాకిస్థాన్ ఒప్పుకోలు

300 Casualties In Balakot Airstrike By India

  • 14 ఫిబ్రవరి 2019లో సీఆర్పీఎఫ్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి
  • 40 మంది జవాన్లు హతం
  • అదే నెల 26న బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ బాంబుల వర్షం

14 ఫిబ్రవరి 2019లో పుల్వామాలోని సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాక్ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్‌ చేపట్టి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ దాడుల్లో తమ వైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అప్పట్లో పాకిస్థాన్ బుకాయించింది. అయితే, భారత్ మాత్రం పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చినట్టు చెప్పింది.

తాజాగా, ఈ విషయంలో స్పష్టత వచ్చింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ తాజాగా వెల్లడించారు. ఓ ఉర్దూ చానల్‌తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ విషయంలో పాక్ చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది.

  • Loading...

More Telugu News