YSRCP: విజయవాడలో నడిరోడ్డుపై బీర్లు తాగుతూ వైసీపీ కార్యకర్తల వీరంగం!

YCP Workers drinking beer middle of the road and broke them

  • ఖాళీ సీసాలను రోడ్డు మధ్యలో పగలగొట్టి బీభత్సం
  • బైక్ విన్యాసాలతో హడలెత్తించిన వైనం
  • అరగంట పాటు కొనసాగిన వికృత చేష్టలు

విజయవాడలో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. నడిరోడ్డుపై బీర్లు తాగుతూ, ఖాళీ సీసాలను పగలగొడుతూ జనాలను హడలెత్తించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొందరు నాయకులు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో కార్యకర్తలు నానా హంగామా చేశారు. నడిరోడ్డుపై బీర్లు తాగుతూ, వాటిని పగలగొడుతూ, బైకులతో భయంగొల్పే విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరి విపరీత చేష్టలు అరగంటపాటు కొనసాగాయి.

  • Loading...

More Telugu News