India: ఆట మొదలు కాగానే, రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా!

Two Wickets down Early Chennai Test in Second Day

  • ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన అలీ
  • అక్సర్, శర్మలు పెవీలియన్ కు
  • ధాటిగా ఆడుతున్న రిషబ్ పంత్

చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తన ఆటను ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. నిన్న 88 ఓవర్ల పాటు ఆడి 6 వికెట్ల నష్టానికి 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ ను కొనసాగించిన ఇండియా, మరొక్క పరుగు జోడించి, అక్సర్ పటేల్, ఇషాంత్ శర్మ వికెట్లను కోల్పోయింది.

ఈ రెండు వికెట్లో మోయిన్ అలీకి లభించడం గమనార్హం. ఆపై తనతో పాటు చేరిన కుల్ దీప్ యాదవ్ తో కలిసి స్కోరును సాధ్యమైనంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో రిషబ్ పంత్ ధాటిగా ఆడేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఓ 6ను కొట్టిన పంత్, తన వ్యక్తిగత స్కోరును 41 పరుగులకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం భారత స్కోరు 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు.

  • Loading...

More Telugu News