Jagan: తిరుపతిలో 1971 భారత్-పాక్ యుద్ధవీరుడ్ని సత్కరించిన సీఎం జగన్

CM Jagan felicitates retired general Venugopal in Tirupathi

  • తిరుపతిలో స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమాలు
  • ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన సీఎం
  • రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం
  • రిటైర్డ్ జనరల్ వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన జగన్

తిరుపతిలో స్వర్నిమ్ విజయ్ వర్ష్ పేరిట భారత సైన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నేడు సీఎం జగన్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ విమోచన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగి 50 ఏళ్లయిన సందర్భంగా సైన్యం ఈ ఉత్సవాలు జరుపుతోంది. గత సంవత్సరం డిసెంబరు 16న ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద వెలిగించిన విజయ జ్వాల నిన్న తిరుపతికి చేరుకుంది. ఆ జ్వాలను నేడు సీఎం జగన్ అందుకున్నారు.

సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ నివాసానికి విచ్చేశారు. 95 ఏళ్ల ఆ రిటైర్డ్ జనరల్ ను సీఎం జగన్ సత్కరించారు. అనంతరం తిరుపతి వైట్ హౌస్ లో ఆర్మీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో విశిష్ట సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పరమవిశిష్ట సేవా పతకం, మహావీరచక్ర వంటి పురస్కారాలు వరించాయి. వేణుగోపాల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

కాగా, ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి స్వాగతం పలికారు. ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన, చెవిరెడ్డి తదితరులు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News