Advocate Couple: అడ్వొకేట్ వామనరావు దంపతుల హత్య కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హెచ్చార్సీ

 Telangana Human Rights Commission takes up Advocate couple murders as suo motto cognizance

  • పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హత్యాకాండ
  • అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణి మృతి
  • ఇది సుమోటోగా స్వీకరించదగ్గ ఘటనేనన్న హెచ్చార్సీ
  • నివేదిక ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశాలు

సంచలనం సృష్టించిన అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల హత్య కేసును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీఎస్ హెచ్చార్సీ) సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా ఈ హత్యలపై స్పందించినట్టు టీఎస్ హెచ్చార్సీ వెల్లడించింది.

ఈ దారుణ హత్యలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. శాంతిభద్రతల వ్యవస్థలు ఇలాంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలతో సమాజంలో శాంతి లోపిస్తుందని పేర్కొంది. ఈ హత్యలు జరిగిన తీరు ఎంతో దురదృష్టకరమని అభిప్రాయపడింది.

ఈ హత్యాకాండలో మరణించినవాళ్లు తమ ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో ఫిర్యాదు చేశారని, కానీ వాళ్ల ప్రాణాలు కాపాడలేకపోయారని టీఎస్ హెచ్చార్సీ విమర్శించింది. ఏదేమైనా ఈ ఘటన సుమోటోగా స్వీకరించడానికి అర్హమైనదేనని భావిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళుతున్న వామనరావు, నాగమణి దంపతులను కత్తులతో నరికి చంపడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News