Corona Vaccination: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసే కరోనా వ్యాక్సిన్ ఖర్చు మేమే భరిస్తాం: కేంద్రం

Second phase corona vaccination from March first
  • దేశంలో పూర్తయిన తొలి విడత కరోనా వ్యాక్సినేషన్
  • మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్
  • రెండో విడతలో 60 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలకు ధర చెల్లించాలని వెల్లడి
దేశంలో ఇప్పటివరకు ఆరోగ్య, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులు, భద్రతా బలగాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని, ఆ వ్యాక్సిన్ ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యాక్సిన్ అందిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వ్యాక్సిన్ ధరను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ధర సర్వీసు రుసుంతో కలిపి రూ.250 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
Corona Vaccination
Second Phase
India
Government Hospitals
Free
Private Hospitals

More Telugu News