Sajjala Ramakrishna Reddy: రిపబ్లిక్ టీవీలో ఫేక్ న్యూస్ ప్రసారం చేశారు: సజ్జల

Republic TV is spreading fake news says Sajjala Ramakrishna Reddy

  • వైసీపీపై అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు
  • అర్నాబ్ ఈ జాతికి పట్టిన పీడ
  • వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదు

రిపబ్లిక్ టీవీలో వచ్చే కథనాల్లో ఒక్కటీ నిజం కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసీపీపై అసత్య కథనాలను ప్రజల్లోకి ఆ టీవీ తీసుకెళ్తోందని మండిపడ్డారు. వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదని... అయినా తప్పుడు కథనాలను ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి ఈ జాతికి పట్టిన పీడ అని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసం ఆ టీవీలో కథనాన్ని వండి వార్చారనే అనుమానం కలుగుతోందని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఆ టీవీలో ఫేక్ కథనాలు వచ్చాయని అన్నారు. జగన్ పాప్యులారిటీని తట్టుకోలేకే ఇలాంటి కథనాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి ఎన్నో అంశాలుంటే... వాటిని వదిలేసి, వైసీపీపై ఫేక్ వార్తలను జనాల్లోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ కథనాల వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.

  • Loading...

More Telugu News