MI: అభిమానులందరూ క్షమించండి: షారూక్ ఖాన్

Sharook Khan Says Sorry to KKR Fans

  • ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ ఓటమి
  • నిరాశ చెందిన అభిమానులు
  • ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పిన షారూక్

నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గెలుపు ముంగిట ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంపై కోల్ కతా ఫ్రాంచైజీ యజమాని షారూక్ ఖాన్ స్పందించారు. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులంతా నిరాశతో సోషల్ మీడియాలో స్పందిస్తుండగా, షారూక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఓ కామెంట్ పెట్టారు.

"నిరాశాజనకమైన ఆటతీరు. అందరు అభిమానులను జట్టు తరఫున క్షమాపణలు కోరుతున్నా" అని ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ ని 15వ ఓవర్ వరకూ నియంత్రణలో ఉంచుకున్న కేకేఆర్ జట్టు, ఆపై జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ ల విజృంభణతో కకావికలై, చాలినన్ని పరుగులు సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో చివరి 6 బంతులకు 15 పరుగులు కావాల్సిన స్థితిలో, 10 పరుగుల దూరంలో కేకేఆర్ ఆగిపోయింది.

  • Loading...

More Telugu News