District Collector: ఈటలపై భూకబ్జా ఆరోపణలు... సీఎస్ కు నివేదిక సమర్పించిన మెదక్ జిల్లా కలెక్టర్

Medak district collector submits report to CS on Eatala land grabbing issue
  • చిక్కుల్లోపడిన ఈటల
  • అసైన్డ్ భూములు ఆక్రమించారని ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
  • ఆరు బృందాలతో భూములు సర్వే చేసిన కలెక్టర్
  • రైతుల నుంచి వివరాల సేకరణ
ఈటల రాజేందర్ భూ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు నివేదిక సమర్పించారు. ఈటల 66 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా చాలా వృక్షాలను నరికివేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. మొదటిరోజు విచారణలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని కలెక్టర్ వివరించారు. ఈ మేరకు 6 పేజీల నివేదిక రూపొందించారు.

ఈ ఉదయం కలెక్టర్ హరీశ్ ఆరు ప్రత్యేక బృందాలతో భూములను సర్వే చేశారు. ఈటల కుటుంబానికి చెందిన హేచరీస్ లో డిజిటల్ సర్వే నిర్వహించారు. అచ్చంపేట గ్రామ రైతుల నుంచి వివరాలు సేకరించి, ఆపై ప్రాథమిక నివేదిక రూపొందించారు.
District Collector
Medak District
Eatala
Report
CS Somesh Kumar
Land Grabbing
TRS
Telangana

More Telugu News