DRDO: రేపే అందుబాటులోకి రానున్న డీఆర్‌డీవో 2డీజీ కరోనా ఔషధం

drdos corona drug will be distributed tomorrow in Delh Hospitas
  • ఢిల్లీలో పంపిణీ చేయనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌
  • తొలి విడతలో 10 వేల డోసుల పంపిణీ
  • ఇటీవలే ఆమోదం తెలిపిన డీసీజీఐ
  • కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి సహకరిస్తున్న ఔషధం
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19  ఔషధం  2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) రేపే అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో డీఆర్‌డీవో 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీని వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది.
DRDO
Corona Virus
DELHI
Dr Reddys Laboratories
Rajnath singh

More Telugu News