Andhra Pradesh: కర్ఫ్యూ వేళలను సడలించిన ఏపీ ప్రభుత్వం

AP govt relaxes curfew timings

  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు
  • పూర్తి స్థాయిలో పని చేయనున్న కార్యాలయాలు
  • సాయంత్రం 5 గంటలకు మూత పడనున్న షాపులు

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేళలను 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయనున్నారు.

అయితే, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. షాపులు, రెస్టారెంట్లు తదితరాలు సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News