Manda Krishna Madiga: అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించి బీజేపీ తప్పు చేసింది: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga Writes Open Letter to BJP Chief Bandi Sanjay

  • అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ముమ్మాటికీ తప్పే
  • ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా దళిత సమాజం గుర్తించదు
  • భవిష్యత్తులోనూ బీజేపీ హాజరు కాదా?

దళితుల సాధికారతకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించడం ముమ్మాటికీ తప్పేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ రాశారు. రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది దళితులకు సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి మాట్లాడడానికి, ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టడానికి సమావేశానికి హాజరు కావడం బీజేపీ బాధ్యత అని మంద కృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడు బీజేపీ ఎన్ని కారణాలు చెప్పినా దళిత సమాజం వాటిని గుర్తించదని అన్నారు.  అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదన్న బీజేపీ నిర్ణయం ఈ ఒక్క దానికే పరిమితమా? లేక భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకూ ఇది వర్తిస్తుందా? అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలని మంద కృష్ణ మాదిగ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News