Bangladesh: మోదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని

Bangladeshi PM Sheikh Hasina sends 2600 kg mangoes as gift to PM Modi

  • ‘హరిబంగ’ రకం మామిడి పండ్లను పంపిన షేక్ హసీనా
  • కోల్‌కతాలోని బంగ్లాదేశ్ అధికారులకు అందిన పండ్లు
  • రాష్ట్రపతి, ప్రధాని, మమత బెనర్జీ సహా ఇతర నేతలకు పంపిణీ

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్రమోదీకి మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2600 కేజీల ‘హరిబంగ’ రకం మామిడి పండ్లను బంగ్లాదేశ్ నుంచి ఓ ట్రక్కులో పంపించారు. భారత్‌తో స్నేహ సంబంధాలకు గుర్తుగా హసీనా వీటిని పంపినట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ అధికారులకు అందిన ఈ మామిడి పండ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా ఇతర రాజకీయ నేతలకు పంపిణీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News