TTD: టీటీడీలోని ఆరుగురు ఉద్యోగులపై శాశ్వత వేటు

TTD Remove 6 employees
  • 2006-08 మధ్య వీరిపై పలు ఆరోపణలు
  • ఆర్జిత సేవా టికెట్ల విక్రయంలో అవకతవకలు
  • అనుకూల వ్యక్తులకు 30 ఏళ్ల వరకు టికెట్ల విక్రయం
  • విచారణ అనంతరం వేటు
ఆరుగురు టీటీడీ ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ టీటీడీ పరిధిలోని వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులపై పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 2006-08 మధ్య కాలంలో ఆర్జిత సేవా టికెట్లను ఇష్టం వచ్చినట్టు విక్రయించినట్టు వీరిపై ఆరోపణలున్నాయి.

తమ అనుకూల వ్యక్తులకు వస్త్రంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవా టికెట్లను 30 ఏళ్ల వరకు మొత్తం విక్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో 18 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో  ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.
TTD
Tirumala
Tirupati
Employees
Jawahar Reddy

More Telugu News