Polavaram Project: పోలవరం రివైజ్డ్ డీపీఆర్ మా వద్ద పెండింగ్ లో లేదు: విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

No Polavaram DPR is in pending says Jal Shakthi ministry

  • 2009 జనవరి 20లోపు అందిన ఏ డీపీఆర్ పెండింగ్ లో లేదు
  • ఆ తర్వాత కేంద్రం వద్దకు ఏ డీపీఆర్ రాలేదు
  • 2005-06 ధరల ప్రకారం డీపీఆర్ ను ఆమోదించారు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 జనవరి 20వ తేదీ లోపు అందిన ఏ డీపీఆర్ కూడా పెండింగ్ లో లేదని చెప్పింది. 2009 జనవరి 20 తర్వాత కేంద్రం వద్దకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ డీపీఆర్ రాలేదని తెలిపింది. 2005-06 ధరల ప్రకారం డీపీఆర్ ను రూ. 10,151.04 కోట్లతో ఆమోదించారని చెప్పింది. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందని తెలిపింది. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాజ్యసభలో ఈ మేరకు సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News