Afghanistan: దేశ ప్రజలందరికీ తాలిబన్ల క్షమాభిక్ష.. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధుల్లో చేరాలని ప్రకటన!

Talibans declares general amnesty to government officials

  • దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజులకు తాలిబన్ల ప్రకటన
  • రోజువారీ కార్యకలాపాల్లో ఉద్యోగులంతా యథావిధిగా పాల్గొనాలని పిలుపు 
  • పూర్తి విశ్వాసంతో విధులు చేపట్టాలని సూచన 

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్ల నుంచి ఈ ప్రకటన వెలువడింది.  

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పూర్తి విశ్వాసంతో విధుల్లోకి చేరాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనాలని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాలిబన్ల ప్రకటన నేపథ్యంలో అక్కడి ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News