Joe Root: హెడింగ్లే టెస్టులో రూట్ సెంచరీ... 250 దాటిన ఇంగ్లండ్ ఆధిక్యం

Root makes another ton

  • హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • సూపర్ ఫామ్ లో రూట్
  • సొంతగడ్డపై శతకం
  • 3 వికెట్లకు 349 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ ఆధిక్యం 271 పరుగులు

హెడింగ్లే టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే! తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ నమోదు చేయగా, ఆతిథ్య జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 349 పరుగులు కాగా, రూట్ 102 పరుగులతోనూ, జానీ బెయిర్ స్టో 29 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 271కి చేరింది. ఆటకు ఇవాళ రెండో రోజే! ఈ నేపథ్యంలో టీమిండియా ముందు రేపు భారీ టార్గెట్ నిలిపేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News