Bhadradri Kothagudem District: ఐదుగురు బాలికలపై లైంగికదాడి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయుడికి 21 ఏళ్ల జైలు శిక్ష

Teacher sentenced for 21 years for rape on girl students

  • పాఠాల పేరుతో స్కూలుకు రప్పించిన ఉపాధ్యాయుడు
  • ఐదుగురిపై అత్యాచారం
  • తీర్పు వెలువరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినప్పటికీ క్లాసుల పేరుతో బాలికలను పాఠశాలకు రప్పించి అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కోర్టు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్‌కుమార్ (40) సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

కరోనా నేపథ్యంలో గతేడాది పాఠశాలలు మూతపడినప్పటికీ సునీల్ కుమార్ మాత్రం కొందరు బాలికలను పాఠాల పేరుతో స్కూలుకు రప్పించేవాడు. ఈ క్రమంలో అతడు విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది డిసెంబరు 5న తల్లిదండ్రుల సాయంతో ఐదుగురు బాలికలు సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

తాజాగా నిన్న ఈ కేసును విచారించిన కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించారు. 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

  • Loading...

More Telugu News