Andhra Pradesh: ఏపీ గవర్నర్ తో ఇండొనేషియా కాన్సుల్ జనరల్ భేటీ

Indonesia Consul General meets AP Governor

  • రాజ్ భవన్ కు వెళ్లిన కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో
  • రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పిన గవర్నర్
  • రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను అందిస్తుందన్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఇండొనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సమకాలీన అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోనే రెండవ పొడవైన సముద్ర తీరప్రాంతంతో పాటు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, సహజవనరులు ఏపీలో ఉన్నాయని కాన్సుల్ జనరల్ కు వివరించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను అందిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News