VV Lakshminarayana: బైక్ పై అరటిగెలలతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... పొటోలు ఇవిగో!

CBI former JD Lakshminarayana visits Ravulapalem market yard

  • తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీనారాయణ పర్యటన
  • రావులపాలెం మార్కెట్ యార్డు సందర్శన
  • రైతులతో మాట్లాడిన వైనం
  • కూలీలు, హమాలీలతోనూ ముచ్చట్లు

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పదవీవిరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించడం తెలిసిందే. జనసేన పార్టీలో చేరిన ఆయన కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

తాజాగా ఆయన జిల్లాలోని రావులపాలెం మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా స్వయంగా బైక్ పై అరటిగెలలను తరలించారు. రైతులతో మాట్లాడి అరటి సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో కూలీలు, హమాలీలు, రవాణాదారులతోనూ లక్ష్మీనారాయణ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News