BCCI: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బుజ్జగించే పనిలో బీసీసీఐ!

BCCI latest proposal to ECB

  • టీమిండియా, ఇంగ్లండ్ ఐదో టెస్టు రద్దు
  • టీమిండియా ఓడినట్టు ప్రకటించాలంటున్న ఈసీబీ
  • టెస్టు రీషెడ్యూల్ కు బీసీసీఐ మొగ్గు
  • జులైలో రెండు అదనపు టీ20లు ఆడతామని ప్రతిపాదన

కరోనా ప్రభావంతో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అనూహ్యంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా ఆటగాళ్లలో ఎవరికీ కరోనా లేకపోయినా వారు ఆడేందుకు మొగ్గుచూపలేదని, అందుకే ఆ టెస్టును వారు ఓడిపోయినట్టు ప్రకటించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పట్టుబడుతోంది. బీసీసీఐ మాత్రం ఈ టెస్టును రీషెడ్యూల్ చేసి భవిష్యత్తులో ఎప్పుడయినా సరే 'ఐదో టెస్టు'గానే ఆడతామని స్పష్టం చేస్తోంది.

ఈ క్రమంలో గరంగరంగా ఉన్న ఈసీబీని బుజ్జగించేందుకు బీసీసీఐ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే జులైలో ఇంగ్లండ్ తో 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే ఫిక్స్ కాగా, అదనంగా మరో రెండు టీ20లు కూడా ఆడతామని భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. ఐదో టెస్టు రద్దుతో జరిగిన నష్టాన్ని, ఈ రెండు అదనపు టీ20ల ద్వారా భర్తీ చేసుకోండి అంటూ బీసీసీఐ ప్రతిపాదిస్తోంది.

ఈ లేటెస్ట్ ఆఫర్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా? అన్నది ఈసీబీకే వదిలేశామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News