Sandstorm: షార్జాలో ఇసుక తుపాను... బెంగళూరు, చెన్నై మ్యాచ్ టాస్ ఆలస్యం

 IPL Match in Sharjah delayed due to sandstorm

  • ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్
  • అడ్డు తగిలిన ఇసుక తుపాను
  • షార్జా నగరాన్ని కమ్మేసిన ఇసుక దుమారం
  • పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు

ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈలో అప్పుడప్పుడు ఇసుక తుపానులు సంభవిస్తుంటాయి. నేడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న షార్జాలో ప్రస్తుతం ఇసుక తుపాను కమ్మేసింది. దాంతో ఈ మ్యాచ్ కు టాస్ వేయడం ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం టాస్ 7 గంటలకు, మ్యాచ్ ప్రారంభం 7.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే, షార్జాలో ఇసుక దుమారం రేగడంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News