Rajasthan: అక్టోబరు 1 నుంచి టపాసులపై రాజస్థాన్ బ్యాన్

Rajasthan government bans firecrackers sale
  • మూడు నెలల పాటు కొనసాగనున్న నిషేధం
  • వచ్చే ఏడాది జనవరి 31 వరకూ టపాసులపై బ్యాన్
  • కరోనా మూడో వేవ్ భయంతోనే అన్న సర్కారు
పండుగల సీజన్‌లో కరోనా మూడో వేవ్ వస్తుందనే భయంతో రాజస్థాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు రాజస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. బాణసంచా కాల్చడం, అమ్మడంపై ఈ నిషేధం అమలవుతుందని తెలిపింది.

గాలి కాలుష్యం వల్ల కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వివరించింది. ఈ కారణంగానే బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు తెలియజేసింది. కాగా, కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే వచ్చే నెలలో దీపావళి, దసరా వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధించడం పట్ల కొందరు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Rajasthan
Firecrackers
New Delhi
Diwali

More Telugu News