Chandrababu: చంద్రబాబు కారు మీద బాంబు వేస్తా: వైసీపీ నేత సెంథిల్

Will through bomb on Chandrababu car says YSRCP leader Senthil Kumar

  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • దమ్ముంటే కుప్పంకు రావాలంటూ చంద్రబాబుకు సెంథిల్ సవాల్
  • ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నాయకులు ఏమాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జల్లాకు చెందిన ఓ వైసీపీ నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'చంద్రబాబూ దమ్ముంటే కుప్పంకు రా. నీ కారు మీద బాంబు వేస్తా' అని అన్నారు. రెస్కో ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు ఎంపీ సహా ఎవరూ మాట్లాడలేదు. అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.

  • Loading...

More Telugu News