Kannababu: సీఎం జగన్‌ని సంబోధించిన పదంతోనే చంద్రబాబును లోకేశ్ పిలుస్తారా?: మంత్రి క‌న్న‌బాబు

kannababu slams chandrababu

  • చంద్ర‌బాబు దొంగ దీక్ష చేశారు
  • దీక్ష‌ ఎందుకు చేశానన్నది చంద్ర‌బాబుకే తెలియ‌దు
  • గతంలో అమిత్ షా మీద చంద్ర‌బాబు రాళ్లు వేయించారు
  • రాష్ట్రానికి  సీబీఐని రానివ్వలేదు

వైసీపీ నేత‌ల‌ తీరుపై టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు చేసిన 36 గంట‌ల‌ దీక్ష‌పై ఏపీ మంత్రి క‌న్నబాబు మండిప‌డ్డారు. ఆయ‌న‌ దొంగ దీక్ష చేశారని, దీక్ష‌ ఎందుకు చేశానో అని చంద్ర‌బాబుకే అనుమానం వ‌చ్చింద‌ని ఎద్దేవా చేశారు. టీడీపీ ఉనికిని చాటుకోవ‌డానికే చంద్రబాబు నాయుడు దీక్షల పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేశార‌న్న విష‌యంపై టీడీపీ నేతలకే స్ప‌ష్ట‌త‌ లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు.

గతంలో అమిత్ షా మీద చంద్ర‌బాబు నాయుడు రాళ్లు వేయించారని, రాష్ట్రానికి సీబీఐని రానివ్వలేదని ఆయ‌న అన్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి చంద్ర‌బాబు ఏం చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. సీఎం జగన్‌ని సంబోధించిన పదంతోనే లోకేశ్‌ కూడా చంద్రబాబును పిలుస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర‌ప‌తితో చంద్ర‌బాబునాయుడు ఏం చెబుతారని ఆయ‌న నిల‌దీశారు. తాము బూతులు తిడితే వైసీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా? అని ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News