Andhra Pradesh: ఏపీలో మరో 95 మందికి కరోనా పాజిటివ్

Ninety five corona cases in AP
  • గత 24 గంటల్లో 27,233 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు
  • కృష్ణా జిల్లాలో ఒక మరణం
  • ఇంకా 1,432 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 27,233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,432 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,481కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Today Cases
Media Bulletin

More Telugu News