TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు.. భక్తులకు టీటీడీ సూచన

dont allow vip letters during vaikunta ekadasi and new years day

  • నేరుగా వచ్చే వీఐపీలకే దర్శనం
  • రోజుకు 45 వేల మంది దర్శనం చేసుకునే ఏర్పాట్లు
  • కరోనా లక్షణాలు ఉంటే ఆగిపోవాలి
  • టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచన 

నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు సిఫారసు లేఖలతో దర్శనాలకు రాకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆ రోజుల్లో నేరుగా వచ్చే వీఐపీలకే బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు.

వైకుంఠ ద్వార దర్శనానికి నిత్యం 45 వేల మంది భక్తులను అనుమతించే విధంగా ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి చెప్పారు. "వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనాలు మొదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు, వీఐపీలకు బ్రేక్ దర్శనం అనంతరం 9 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది’’ అని ఆయన వివరించారు. భక్తులు ఎవరైనా కానీ కరోనా లక్షణాలు ఉంటే స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News