TS High Court: కరోనా ఎఫెక్ట్... తెలంగాణ హైకోర్టులో ప్రత్యక్ష విచారణల నిలిపివేత

Telangana high court suspends physical hearings due to corona affect

  • తెలంగాణలో కరోనా తీవ్రత
  • పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు

తెలంగాణలో కరోనా వ్యాప్తి మరోసారి అధికమవుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్, సింగిల్ బెంచ్ లలో ప్రత్యక్ష విచారణలను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. అయితే, వ్యక్తిగత హోదాలో జడ్జీలు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ ప్రత్యక్ష విచారణ జరుపుకోవచ్చని పేర్కొంది.

ఆన్ లైన్, లేదా ఆఫ్ లైన్ విచారణ వారి ఇష్టానికే వదిలేసింది. తెలంగాణలో కొవిడ్-19, ఇతర వేరియంట్ల విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది.

ఒకవేళ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని జడ్జీలు భావించినట్టయితే, న్యాయవాదులతో పాటు కక్షిదారులు కూడా కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాలని, మాస్కులు ధరించడంతో పాటు శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News