Andhra Pradesh: ఏపీలో నేడు యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు

Banks in Andhrapradesh works today

  • సంక్రాంతి సెలవును నిన్ననే ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు నేడు పనిదినం
  • యథావిధిగా కార్యకలాపాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు నేడు యథావిధిగా కొనసాగనున్నాయి. నిజానికి ఈ రోజు సంక్రాంతి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సెలవును ఒక రోజు ముందుకు జరిపింది. ఈ నెల 13న భోగి, 14న సంక్రాంతి అని ప్రభుత్వం ఇటీవల ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు నిన్న మూతపడ్డాయి.

ఫలితంగా నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని బ్యాంకు అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News