KTR: ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్

KTR slams PM Modi over bifurcation remarks

  • మోదీపై మరోసారి ధ్వజమెత్తిన కేటీఆర్
  • మోదీవి పనికిమాలిన మాటలని విమర్శలు
  • అసహ్యకరంగా మాట్లాడారని వ్యాఖ్య  
  • మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పార్లమెంటులో అసహ్యకరంగా మాట్లాడారని విమర్శించారు. మోదీ మాట్లాడినవి పనికిమాలిన మాటలు అని అభివర్ణించారు. చట్టసభల్లో ఇలా మాట్లాడిన ప్రధానమంత్రి మరొకరు లేరని స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ప్రధాని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ ముందంజలో ఉందని ప్రధానికి కడుపుమంట అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News