Budda Venkanna: ఎమ్మెల్యే రోజా మాటలకు విలువ ఉండ‌దు: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna slams jagan

  • రోజా చేసిన వ్యాఖ్య‌ల‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేదు
  • వివేకానంద‌రెడ్డిని ఎవరు హత్యచేశారో జ‌గ‌న్ చెప్పాలి
  • జనసేన బ్యానర్లను తొలగించడాన్ని ఖండిస్తున్నాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఎవరు హత్యచేశారో జ‌గ‌న్ చెప్పాలని ఆయ‌న అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె సునీతకు రక్షణ కల్పించాలని ఆయ‌న చెప్పారు. 

ఇటీవ‌ల త‌మ‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, అస‌లు రోజా మాటలకు విలువ ఉండదని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ఆమె చేసిన వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా, విజ‌య‌వాడ‌లో జనసేన క‌ట్టుకున్న‌ బ్యానర్లను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News