Salman Khan: కొత్త చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. సమన్లు జారీ చేసిన కోర్టు!

Court gives summons to Salman Khan in attack on journalist case

  • 2019లో జర్నలిస్టుపై దాడి 
  • సల్మాన్, ఆయన బాడీగార్డుపై కేసు
  • ఏప్రిల్ 5కి విచారణను వాయిదా వేసిన కోర్టు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. మరోవైపు, ఆయన జీవితం ఎంతో రంగులమయంగా ఉంటున్నప్పటికీ.. అదే స్థాయిలో ఆయనను ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.

కృష్ణ జింకలను చంపిన కేసు సల్మాన్ ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉంది. తాజాగా ఒక జర్నలిస్టుపై దాడి చేసిన కేసు ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బాధిత జర్నలిస్టు అశోక్ పాండే చేసిన ఫిర్యాదు మేరకు... సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద కేసులు పోలీసులు కేసు నమోదు చేసినట్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమన్లు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News