India: కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. ఎప్పటి నుంచి అంటే..!

No more covid restriction in India after March 31

  • కొన్ని రోజులుగా భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
  • మార్చి 31 నుంచి అన్ని కోవిడ్ నిబంధనలను తొలగిస్తున్న కేంద్రం
  • మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి అన్ని కోవిడ్ నిబంధనలను తొలగిస్తున్నట్టు కేంద్రం ఈరోజు ఓ ప్రకటనలో తెలిపింది. 

అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. మార్చి 31తో కోవిడ్ రూల్స్ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మన దేశంలో ఇప్పటి వరకు 1,81,89,15,234 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ వ్యాక్సినేషన్ వల్ల భారత్ లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.

  • Loading...

More Telugu News