YS Jagan: ఏపీ సీఎం జ‌గ‌న్‌తో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ఎస్తెర్ భేటీ

nobel laureate esther duflo meets ap cm ys jagan

  • 2019లో నోబెల్ అందుకున్న ఎస్తెర్‌
  • అభిజిత్ బెన‌ర్జీ, మైఖేల్ క్రీమ‌ర్ల‌తో క‌లిసి అవార్డుకు ఎంపిక‌
  • సీఎం జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌, ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త ఎస్తెర్ ఢ‌ఫ్లో భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన ఫ్రెంచ్ అమెరిక‌న్ ఆర్థిక వేత్త జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. 2019 ఏడాదికి గానూ ఎస్తెర్‌.. అభిజిత్ బెన‌ర్జీ, మైఖేల్ క్రీమ‌ర్ల‌తో క‌లిసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమ‌తి అందుకున్నారు. సీఎం జ‌గ‌న్‌తో ఎస్తెర్ భేటీకి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

  • Loading...

More Telugu News