Chiranjeevi: చిరంజీవి 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా జగన్!

Jagan is the chief guest for Chiranjeevi movie Acharya pre release event

  • ఈ నెల 23న విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య'
  • ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్ ఈమెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. ఈ నెల 23న విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక పాత్రను పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ప్రతి నాయకుడి పాత్రను సోనుసూద్ పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

  • Loading...

More Telugu News