Jose Buttler: సిక్సర్ తో సెంచరీ అందుకున్న బట్లర్... టోర్నీలో అత్యధిక స్కోరు సాధించిన రాజస్థాన్

With Jose Buttler second century Rajasthan Royals registered highest score in tourney

  • టోర్నీలో రెండో శతకం సాధించిన బట్లర్
  • 61 బంతుల్లో 103 పరుగులు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 రన్స్ చేసిన రాజస్థాన్
  • రాణించిన శాంసన్, హెట్మెయర్, పడిక్కల్

డాషింగ్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ ఐపీఎల్ తాజా సీజన్ లో రెండో సెంచరీ నమోదు చేసిన వేళ, రాజస్థాన్ రాయల్స్ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. బట్లర్ ఓ భారీ సిక్స్ తో సెంచరీ మార్కు అందుకోవడం విశేషం. 

బట్లర్ స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. బట్లర్ క్రీజులో ఉన్నంత సేపు ఏ దశలో రన్ రేట్ 10కి తగ్గలేదు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (24), కెప్టెన్ సంజు శాంసన్ (38)లతో కలిసి బట్లర్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 

చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 200 మార్కు దాటింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ 1, ఆండ్రీ రస్సెల్ 1, శివం మావి 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News