Mogilayya: కిన్నెర కళాకారుడు 'పద్మశ్రీ' మొగిలయ్య కుటుంబంలో విషాదం.. కుమార్తె మృతి

Tragedy looms in Padma Sri Mogillayya family as his second daughter died

  • నాగర్ కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న మొగిలయ్య
  • తండ్రితో పాటే ఉంటున్న రెండో కుమార్తె
  • మరణించిన వృద్ధురాలిని చూసి వస్తుండగా ప్రమాదం
  • తలకు బలమైన గాయాలు 

ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెర కళాకారుడు మొగిలయ్య కుమార్తె ప్రమాదవశాత్తు మరణించింది. మొగిలయ్య నాగర్ కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్నారు. ఆయన రెండో కుమార్తె బుద్ధుల రాములమ్మ (38) పెళ్లయిన నాలుగేళ్లకే భర్తను కోల్పోయింది. దాంతో ఆమె తండ్రి వద్దనే ఉంటోంది. 

అయితే, తమ గ్రామంలో ఓ వృద్ధ మహిళ చనిపోవడంతో చూసేందుకు వెళ్లి తిరిగొస్తుండగా, రాములమ్మ రోడ్డుపై జారిపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తుతూ రాములమ్మ కన్నుమూసింది. రెండో కుమార్తె మృతితో మొగిలయ్య శోకసంద్రంలో మునిగిపోయారు. రాములమ్మ అంత్యక్రియలు నిన్న జరిగాయి.

  • Loading...

More Telugu News