Punjab Kings: బెయిర్ స్టో అర్ధసెంచరీ... జితేష్, లివింగ్ స్టోన్ మెరుపులు... పంజాబ్ కింగ్స్ భారీస్కోరు

Punjab Kings registers 189 runs after Bairstow fifty

  • ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 రన్స్
  • 3 వికెట్లు తీసిన చహల్

రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్ స్టో మళ్లీ ఫామ్ లోకి రావడం పంజాబ్ కు ఊరటనిచ్చే అంశం. ఓపెనర్ గా వచ్చిన బెయిర్ స్టో 40 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులు చేయడం విశేషం. 

మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12) విఫలమైనా, భానుక రాజపక్స (27)తో కలిసి బెయిర్ స్టో విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మిడిలార్డర్ లో బరిలో దిగిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చివర్లో జితేష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ లతో పంజాబ్ స్కోరు 150 మార్కు దాటింది.

జితేష్ శర్మ 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 38 పరుగులు చేయగా, లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లతో 22 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

  • Loading...

More Telugu News