Chandrababu: ఏ1 చంద్రబాబు, ఏ2 నారాయణ.. మరో కేసు నమోదు!

AP CID files FIR against Chandrababu and Narayana in Amaravati land pooling case
  • అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందంటూ కేసు
  • వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్
  • నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ
మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదయింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్ననే సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   

ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
Chandrababu
P Narayana
Telugudesam
Amaravati
Land Pooling
AP CID

More Telugu News