YSRCP: కేంద్ర మంత్రులు నిర్మ‌ల‌, గోయ‌ల్‌ల‌కు జ‌గ‌న్ లేఖ‌.. ఆవ నూనెపై సుంకం తగ్గించాల‌ని విన‌తి

ap cm ys jagan letters to union ministers nirmala sitharaman and piyush goyal

  • యుద్ధం కార‌ణంగా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌కు కొర‌త‌
  • ఫ‌లితంగా మండుతున్న‌ వంట నూనెల ధ‌ర‌లు
  • ఆవ నూనెపై సుంకం త‌గ్గింపుతో ఉప‌శ‌మ‌నమ‌న్న‌ జ‌గ‌న్‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, పీయూష్ గోయ‌ల్‌ల‌కు లేఖ‌లు రాశారు. ఆవ‌నూనెపై సుంకాన్ని త‌గ్గించాల‌ని ఈ లేఖ‌ల్లో ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను కోరారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య యుద్ధం కార‌ణంగా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డిన విష‌యాన్ని ఆయ‌న త‌న లేఖ‌ల్లో ప్ర‌స్తావించారు. ఈ కార‌ణంగా వంట నూనెల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని, ఈ ధ‌ర‌ల నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కాస్తంతైనా ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే ఆవ నూనెపై కేంద్రం విధిస్తున్న సుంకాల‌ను ఏడాది పాటు త‌గ్గించాల‌ని కేంద్ర మంత్రుల‌ను జ‌గ‌న్ కోరారు.

  • Loading...

More Telugu News