CM KCR: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR announces exgratia to road accident victims families

  • కర్ణాటకలోని కలబురిగి వద్ద ఘోరప్రమాదం
  • గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు
  • మినీ లారీని ఢీకొట్టి అగ్నికీలల్లో చిక్కుకున్న బస్సు
  • 8 మంది హైదరాబాదీల సజీవ దహనం

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది హైదరాబాదీలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News