met amaravati: ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!

MeT issues Yellow alert for Telangana and andhra pradesh

  • తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్ష సూచన
  • నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు
  • ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఏపీలో అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పింది. అదే సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ఇక, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News