Team India: మరోసారి రాణించిన పంత్... 300 దాటిన టీమిండియా ఆధిక్యం

Team India lead edge past 300 mark in Birmingham

  • ఆసక్తికరంగా బర్మింగ్ హామ్ టెస్టు
  • పంత్ అర్ధసెంచరీ
  • రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • భారత్ ఆధిక్యం 326 పరుగులు

బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే దిశగా సాగుతోంది. రిషబ్ పంత్ మరోసారి బ్యాట్ కు పనిచెప్పడంతో టీమిండియా ఆధిక్యం 300 మార్కు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 60 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి మాథ్యూ పాట్స్ కు వికెట్ అప్పగించాడు. ప్రస్తుతం పంత్ 53 పరుగులతోనూ, జడేజా 4 పరుగులతోనూ ఆడుతున్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 326 పరుగులకు చేరింది. అంతకుముందు, ఛటేశ్వర్ పుజారా 66 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News