Guntur-Tirupati: గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 18న పునఃప్రారంభం

Guntur to Tirupati express will revive on August 18th

  • కరోనా సమయంలో నిలిచిన పలు రైళ్లు
  • క్రమంగా రైళ్ల పునరుద్ధరణ
  • 7 జిల్లాల మీదుగా గుంటూరు-తిరుపతి రైలు పయనం
  • రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ బీజేపీ నేతలు

కరోనా సంక్షోభ సమయంలో రైల్వే శాఖ అనేక రైళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు శాంతించడంతో క్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. తాజాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునఃప్రారంభిస్తోంది. ఆగస్టు 18 నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

ఈ రైలు నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. కాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించడంపై ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News