Sahera Begum: విజయవాడ విజిలెన్స్ సీఐ సహెరా బేగంకు అరుదైన గౌరవం

US govt invites Vijayawada Vigilance CI Sahera Begum

  • మహిళల పట్ల దాడులు-హింసపై అమెరికాలో సదస్సులు
  • ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 2 వరకు సమావేశాలు
  • సహెరా బేగంను ఆహ్వానించిన అమెరికా ప్రభుత్వం

విజయవాడ విజిలెన్స్ సీఐ సహెరా బేగం అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాలో జరిగే అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం లభించింది. మహిళలపై దాడులు-హింస అంశంపై ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 2 వరకు అమెరికాలో సదస్సులు నిర్వహించనున్నారు. 

మహిళల పట్ల పురుషుల బాధ్యత, మహిళలపై అకృత్యాలు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనాలంటూ సీఐ సహెరా బేగంకు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. కాగా, ఈ సదస్సులకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ దేశాల్లో మహిళల పరిస్థితిపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు.

  • Loading...

More Telugu News