Andhra Pradesh: నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

Rottela Panduga Starts today in Nellore

  • ఈ నెల 13 వరకు జరగనున్న రొట్టెల పండుగ
  • కోర్కెలు తీరాలంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోనున్న జనం
  • 2015లో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 

బారా షహాద్ దర్గా వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయస్థాయిలోనూ గుర్తింపు ఉంది.

  • Loading...

More Telugu News