Revanth Reddy: ఈ నెల 20 నుంచి మునుగోడులోనే ఉంటా: రేవంత్ రెడ్డి

Will be in Munugodu from August 20 says Revanth Reddy

  • తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు
  • కాంగ్రెస్ నేతలెవరూ పార్టీ మారొద్దన్న రేవంత్
  • ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని వ్యాఖ్య

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా పార్టీ మారొద్దని కోరారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలబడదామని చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని చెప్పారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులోనే ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News