Telangana: ఈట‌ల రాజేంద‌ర్ తండ్రి మృతికి సంతాపం తెలిపిన కేటీఆర్‌... కృతజ్ఞతలు చెప్పిన ఈట‌ల‌

ktr condolences to etela rajender on his father death

  • మంగ‌ళ‌వారం రాత్రి చ‌నిపోయిన ఈట‌ల మ‌ల్ల‌య్య‌
  • బుధ‌వారం రాజేంద‌ర్ స్వ‌గ్రామంలో ముగిసిన అంత్య‌క్రియ‌లు
  • రాజ‌కీయ వైరాన్ని మ‌రిచి సంతాపం తెలిపిన కేటీఆర్‌

బీజేపీ నేత‌, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తండ్రి మ‌ల్ల‌య్య‌ మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయాక క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఈట‌ల రాజేంద‌రే వెల్ల‌డించారు. అంతేకాకుండా బుధ‌వారం మ‌ధ్యాహ్న‌మే త‌న తండ్రి అంత్య‌క్రియ‌లను త‌న స్వ‌గ్రామం క‌మ‌లాపూర్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు కూడా రాజేంద‌ర్ పేర్కొన్నారు. ఆయన ప్ర‌క‌టించిన‌ట్లుగానే మ‌ల్ల‌య్య అంత్య‌క్రియ‌లు బుధ‌వారం మ‌ధ్యాహ్నం ముగిశాయి కూడా.

ఇదిలావుంచితే, పితృవియోగంతో దుఃఖంలో వున్న రాజేందర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఈట‌ల మ‌ల్ల‌య్య మృతి బాధాక‌ర‌మ‌న్న కేటీఆర్‌... ఈటల రాజేంద‌ర్‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈట‌ల మ‌ల్ల‌య్య ఆత్మకు శాంతి చేకూరాల‌ని కూడా కేటీఆర్ కోరారు. ఈ ట్వీట్ చేసిన వెంట‌నే కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ రాజేంద‌ర్ రీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News