YSRCP: వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌లు... టీడీపీ మ‌హిళా నేత‌పై కేసు న‌మోదు

singanamala police files a case on tdp leader undavalli anusha overs social media posts on ysrcp mla jonnalagadda padmavathi

  • సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌ద్మావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన భీమిశెట్టి శ్రీనివాసులు
  • ఏలూరులోని ఇంటి వ‌ద్ద అనూష‌కు నోటీసులు ఇచ్చిన శింగ‌న‌మ‌ల పోలీసులు

వైసీపీ మ‌హిళా నేత‌, అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు పోస్ట్ చేసిన వైనంపై శింగ‌న‌మ‌ల పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ను నిందితురాలిగా చేరుస్తూ శింగ‌న‌మ‌ల పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

అంతేకాకుండా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌ల‌పై 3 రోజుల్లోగా సంజాయ‌షీ ఇవ్వాలంటూ ఉండ‌వ‌ల్లి అనూష‌కు ఏలూరులోని ఆమె ఇంటి వ‌ద్దే శింగ‌న‌మ‌న‌ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కే ఉండ‌వ‌ల్లి అనూష‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

  • Loading...

More Telugu News