Shikhar Dhawan: 'టాయిలెట్‌లో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ల‌కు భోజ‌నం'పై యూపీ సీఎంకు ఫిర్యాదు చేసిన శిఖ‌ర్ ధావ‌న్‌

Shikhar Dhawan complains over kavaddi players video to up cmyogi adityanath

  • క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ల‌కు టాయిలెట్‌లో భోజ‌నం పెట్టిన వైనం
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
  • బాధ్యులపై త‌గిన రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌బ్బ‌ర్ డిమాండ్‌

రాష్ట్ర స్థాయి క‌బ‌డ్డీ టోర్న‌మెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన బాలిక‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు స‌భ్యుల‌కు టాయిలెట్‌లో భోజ‌నం వ‌డ్డించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోపై తాజాగా టీమిండియా స్టార్ క్రికెట‌ర్ శిఖర్ ధావ‌న్ బుధ‌వారం రాత్రి స్పందించాడు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న‌పై దృష్టి సారించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్, ఆ రాష్ట్ర క్రీడా శాఖ‌ను కోరాడు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై త‌గిన రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శిఖర్ డిమాండ్ చేశాడు.

  • Loading...

More Telugu News